Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: ఇంటర్ పరీక్షల రుసుం చెల్లింపు గడువు పెంపు

 

టి‌ఎస్: ఇంటర్ పరీక్షల రుసుం చెల్లింపు గడువు పెంపు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించే గడువును ఈ నెల 22వ తేదీ వరకూ పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఆ గడువు గురువారంతో ముగిసింది. రూ.100 ఆలస్య రుసుంతో ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు, రూ.500తో మార్చి 2 నుంచి 8 వరకు, రూ.వెయ్యితో మార్చి 9 నుంచి 15 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మార్చి 16 నుంచి 22వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రుసుం తీసుకుంటామని ఏ కళాశాల యాజమాన్యం అభ్యంతరం చెప్పరాదని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలీల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags