Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: ఇంటర్‌ పాత విద్యార్థులకూ ఊరట - పరీక్షల్లో ‘70% సిలబస్‌.. 50% ఛాయిస్‌’ వర్తింపు

 

టి‌ఎస్: ఇంటర్‌ పాత విద్యార్థులకూ ఊరట - పరీక్షల్లో ‘70% సిలబస్‌.. 50% ఛాయిస్‌’ వర్తింపు

దాదాపు 2 లక్షల మందికి ప్రయోజనం

గతంలో ఇంటర్‌ తప్పిన విద్యార్థులకు, కొత్త విధానంలో రూపొందించే ప్రశ్నపత్రాలతోనే పరీక్ష నిర్వహించనున్నారు. మే 1 నుంచి జరిగే ఇంటర్‌ వార్షిక పరీక్షలకు కరోనా పరిస్థితుల నేపథ్యంలో 30 శాతం సిలబస్‌ తగ్గించడంతోపాటు ప్రశ్నపత్రాల్లో సగం ఛాయిస్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని పాత విద్యార్థులకూ వర్తింపజేయనున్నారు.

* గత మార్చి వార్షిక పరీక్షల్లో 4,80,555 మంది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా వారిలో 1,92,172 మంది తప్పారు. వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదు. వచ్చే మే నెలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలతో పాటే వీరు ప్రథమ సంవత్సరంలో తప్పిన సబ్జెక్టులను రాయనున్నారు. ఈ పరీక్షల్లోనూ 70 శాతం సిలబస్‌, 50 శాతం ఛాయిస్‌ వర్తింపజేశారు. ఆయా విద్యార్థులు రెండు సంవత్సరాల పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉన్నందున ఒత్తిడికి లోనుకాకుండా ఈ అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

* గత మార్చిలో ఇంటర్‌ ద్వితీయ వార్షిక పరీక్షలు రాసి.. తప్పిన దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు, ఫీజు చెల్లించినా పరీక్షలు రాయని మరో 27,589 మందిని ప్రభుత్వం కనీస మార్కులతో పాస్‌ చేసిన సంగతి తెలిసింది. ఇంకా కొన్ని వేల మంది పరీక్ష ఫీజు చెల్లించని వారు, పరీక్షలు రాయని వారు ఉన్నారు. ఇలాంటివారికి పాత సిలబస్‌ ప్రకారం కాకుండా కొత్త విధానంలోనే పరీక్షలు జరుపుతారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags