Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల


టి‌ఎస్: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ శాసనమండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆ స్థానాల భర్తీకి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. 

మంగళవారం మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ అదనపు కమిషనర్ ‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ మండలి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇవాళ్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మరుసటిరోజు నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు నిర్వహిస్తారు. 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags