Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: రేపటి నుంచి పి‌ఈ సెట్ తుది విడత కౌన్సెల్లింగ్ – ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో వెబ్ ఐచ్చికాలకు అనుమతి

 

టి‌ఎస్: రేపటి నుంచి పి‌ఈ సెట్ తుది విడత కౌన్సెల్లింగ్ – ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో వెబ్ ఐచ్చికాలకు అనుమతి

తెలంగాణ పీఈ సెట్-2020 రెండు, తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియను ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి. రమేశ్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న బీపీఈడీ, యూజీ డీపీ ఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తేదీలను ప్రకటించారు.

ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపులు, ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తారు. 11వ తేదీన రిజిస్ట్రేషన్ పూర్తయిన అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు. 11, 12 తేదీల్లో రెండో విడత వెబ్ ఐచ్చికాల ప్రక్రియ నిర్వహిస్తారు. 13న సాయంత్రం 5 గంటల వరకు ఐచ్ఛికాలు సవరించుకునేందుకు అనుమతిస్తారు. 14న కళాశాల వారీగా విద్యార్థుల జాబితాలు వెబ్ సైట్లో ప్రదర్శిస్తారు. 15 నుంచి 18 వరకు కేటాయించిన కళాశాలల్లో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన, ట్యూషన్ ఫీజు చలానా లను పరిశీలించనున్నారు.

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags