Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 01-03-2021

 

AP Covid-19 Media Bulletin 01-03-2021

ఏపీలో కొత్తగా 58 కొవిడ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఎవరూ మరణించలేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 51 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,89,974కు చేరగా, ఇప్పటి వరకు 8,82,080 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని, 7,169 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం 725 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 20,269 శాంపిళ్లు, మొత్తంగా 1.39 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, విజయనగరం జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాకపోవడం గమనార్హం.


Previous
Next Post »
0 Komentar

Google Tags