Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

మొదటి నాలుగు గంటల్లోనే టీకా కోసం 10లక్షల మంది నమోదు

 

మొదటి నాలుగు గంటల్లోనే టీకా కోసం 10లక్షల మంది నమోదు

కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశంలో రెండో దశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఇందుకోసం కొవిన్‌ పోర్టల్‌ను ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి తీసుకురాగా, తొలి రోజే విశేష స్పందన లభించింది. కేవలం 4 గంటల్లోనే 10లక్షల మందికి పైగా పేరు నమోదు చేసుకున్నారు. కొవిన్‌ పోర్టల్‌ను ఈ ఉదయం 9 గంటలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 10లక్షల మందికి పైగా ఈ పోర్టల్‌ ద్వారా టీకా కోసం అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

టీకా తీసుకోవాలనుకునేవారు www.cowin.gov.in లేదా ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. లేదంటే సమీప వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్లి కూడా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంది. ప్రస్తుతానికి కొవిన్‌ యాప్‌లో సామాన్య ప్రజలకు నమోదు ప్రక్రియ అందుబాటులో లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. 

రెండోదశలో భాగంగా 60ఏళ్లు పైబడిన, 45-59ఏళ్ల మధ్యవయస్సు కలిగినవారిలో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు నేటి నుంచి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు కూడా నేడు టీకా తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ప్రైవేటులో టీకా ఒక్కో డోసు ధర రూ. 250గా నిర్ణయించిన విషయం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags