Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: మాస్క్ మస్ట్, లేకపోతే జరిమానాల మోత - ప్రయాణాలు, ఫంక్షన్లపై కీలక సూచనలు

 

ఏపీ: మాస్క్ మస్ట్, లేకపోతే జరిమానాల మోత - ప్రయాణాలు, ఫంక్షన్లపై కీలక సూచనలు

వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యేవారిని వదిలి పెట్టొద్దన్నారు. మాస్కులు ధరించని వారికి, కోవిడ్‌ నియమావళిని పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.

ఎస్పీలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష

మాస్క్ మస్ట్, లేకపోతే జరిమానాల మోత

ప్రయాణాలు, ఫంక్షన్లపై కీలక సూచనలు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ భయం అందర్నీ వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదివారం (March 28) జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాస్క్‌ లేకుండా బయటికి వచ్చే వారికి జరిమానా విధించాలనన్నారు. వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యేవారిని వదిలి పెట్టొద్దన్నారు. మాస్కులు ధరించని వారికి, కోవిడ్‌ నియమావళిని పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. 

కరోనా నియంత్రణకు నియమాలను ప్రజలకు తెలియజేసేలా నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయొద్దని, నిత్యావసర సరుకులు, అత్యవసరాల కోసమే బయటకు రావాలని కోరారు. వేడుకలు, విందులు, ఇతర ఫంక్షన్లు సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవడం మంచిదన్నారు. కుదిరితే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాసు్కలు ధరించడం, శానిటైజర్‌ వాడటం, భౌతిక దూరం పాటించటం వంటివి విధిగా పాటించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, విద్యార్థులు కోవిడ్ నియమాలు పాటించాలన్నారు. 

ఒకరిద్దరి నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మందికి వైరస్‌ వ్యాప్తి చెంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు డీజీపీ. మాస్క్‌ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. పోలీసులు చేపడుతున్న చర్యలు ప్రజల కోసం, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అతి కొద్ది మంది జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందన్నారు. మరోవైపు కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు. మాస్క్‌ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 18,565 మందికి ఒక్క రోజులో రూ.17.34 లక్షల ఫైన్‌ విధించారు. మాస్క్‌ లేని వారికి రూ.250కి తగ్గకుండా జరిమానా విధించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags