Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU: Postponed All Examinations in AP & Telangana

 


BRAOU: Postponed All Examinations in AP & Telangana

అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ కీలక ప్రకటన అన్నీ పరీక్షలు వాయిదా

పరీక్షలన్నీ తాత్కాలికంగా వాయిదా

త్వరలో కొత్త తేదీలు విడుదల

డాక్టర్‌ బీఆర్‌ అంబే‌ద్కర్‌ సార్వత్రిక విశ్వవి‌ద్యా‌ల‌యం (BRAOU) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్నీ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు ఈ ప్రకటన వర్తిస్తుందని పేర్కొంది. 

కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు మూసివేయడం, అన్నీ యూనివర్సిటీలు పరీక్షలు వాయిదా వేస్తుండటంతో అంబేద్కర్‌ వర్సిటీ సైతం పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. డిగ్రీ వార్షిక పరీ‌క్షలు ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. డిగ్రీ మూడో సంవ‌త్సరం పరీ‌క్షలు ఏప్రిల్‌ 15 నుంచి 20 వరకు, రెండో సంవ‌త్సరం పరీ‌క్షలు ఏప్రిల్‌ 22 నుంచి 27 వరకు, మొదటి సంవ‌త్సరం పరీ‌క్షలు ఏప్రిల్‌ 28 నుంచి మే 1 వరకు జరు‌గ‌ను‌న్నట్లు ప్రకటించింది. 

అభ్యర్థులు ఈ నెల 25లోగా ఫీజు చెల్లిం‌చా‌లని.. పరీ‌క్షకు రెండు‌రో‌జుల ముందు హాల్‌‌టి‌కెట్లు డౌన్‌‌లోడ్‌ చేసు‌కో‌వా‌లని గతంలో అధి‌కా‌రులు సూచించారు.

అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

బీఈడీ అర్హత పరీక్ష:

ఇక బీఈడీ అర్హత పరీక్షను ఏపీ, తెలంగాణలో మార్చి 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని ఇటీవల వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షను కూడా వాయిదా వేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

WEBSITE

NOTICE ON POSTPONEMENT

Previous
Next Post »
0 Komentar

Google Tags