Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: పీఆర్సీ ప్రకటించేందుకు మార్గం సుగమం - సీఎం రేపు అసెంబ్లీలో‌ కీలక ప్రకటన

 

టి‌ఎస్: పీఆర్సీ ప్రకటించేందుకు మార్గం సుగమం  - రేపు అసెంబ్లీలో  సీఎం‌ కీలక ప్రకటన

తెలంగాణలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనపై రాష్ట్ర ఆర్థికశాఖ ఈసీ అనుమతి కోరింది.

దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం, పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది. అయితే అనవసర ప్రచారం చేయరాదని, ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ లేఖ రాశారు.

ఉద్యోగులకు 29శాతం పీఆర్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, కానీ 30% అని కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయి. రేపు సి‌ఎం అసెంబ్లీ లో దీని మీద స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags