Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేత - విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 

TS: రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేత - విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

COVID-19 – Disaster Management Act, 2005 – Closing of Educational Institutions – Orders – Issued

G.O.Ms.No.67 Dated:23.03.2021

DOWNLOAD G.O

తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు మినహా, ప్రైవేట్ మరియు ప్రభుత్వ అన్ని విద్యాసంస్థలు, తదుపరి ఉత్తర్వుల వరకు మూసివేయబడతాయి.

ఆన్‌లైన్ / దూరవిద్య మునుపటిలాగే కొనసాగుతుంది.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు. 

‘‘కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మూసివేత ఆదేశాలు వైద్యకళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయి’’ అని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags