Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏ‌పి: ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ -2021 వాయిదా – ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ

 

ఏ‌పి: ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ -2021 వాయిదా – ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ

మే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో జరగాల్సిన ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ కోవిడ్ కారణంగా వాయిదా పడినట్లు గుంటూరు స్టెప్ సీఈవో డాక్టర్ వి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు యథావిధి గా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారని, రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన తేదీలను తరువాత తెలియజేస్తామని పేర్కొన్నారు.

ఈ నెల 30వ తేదీలోపు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే తదుపరి తేదీల్లో జరిగే ర్యాలీకి అర్హులని పేర్కొన్నారు. గత ఏడాది కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షలు రద్దు చేయడంతో సర్టిఫికెట్లో అన్ని సబ్జెక్టులు పాస్ అని ఉందని, ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు 'డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా, గొల్లపూడి, విజయవాడ నందు సంప్రదించి తమ మార్కులిస్టులను తెచ్చుకోవాలని సూచించారు.

ఈ ర్యాలీ గురించి, మరిన్ని వివరాలు కోసం  👇

ఏపీ, గుంటూరు - ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ - 2021

Previous
Next Post »
0 Komentar

Google Tags