Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 07-04-2021

 

AP Covid-19 Media Bulletin 07-04-2021

ఏపీలో 2331 కొత్త కరోనా కేసులు

ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకీ మరింత అధికమవుతోంది. ఇటీవల కాలంతో పోలిస్తే ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో 31,812 నమూనాలను పరీక్షించగా 2,331 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,13,274కి చేరింది. 

ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 11 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,262కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 853 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 13,276 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,02,583 నమూనాలను పరీక్షించారు. ఇప్పటికి 8,92,736 మంది పూర్తిగా కోలుకున్నట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.



Previous
Next Post »
0 Komentar

Google Tags