Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 08-04-2021

 

AP Covid-19 Media Bulletin 08-04-2021

ఏపీలో 2558 కొత్త కరోనా కేసులు

ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకీ మరింత అధికమవుతోంది.

తాజాగా వివరాల ప్రకారం ఒక్కరోజు వ్యవధిలో 31,268 నమూనాలను పరీక్షించగా 2,558 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,15,832కి చేరింది. 

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ ఆరుగురు మృతిచెందారు.  కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,268కి చేరింది. ఒక్కరోజులో 915 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం 14,913 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,33,851 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు 8,93,651 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags