Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 20-04-2021

 

AP Covid-19 Media Bulletin 20-04-2021

ఏపీలో 8987 కొత్త కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 37,922 నమూనాలను పరీక్షించగా 8,987 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. నిన్న 5,963 కేసులు నిర్ధారణ కాగా, ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,347, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 99 మందికి వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,76,987కి చేరింది. 

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 35 మృతిచెందారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 8 మంది మరణించగా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చనిపోయారు. తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,472కి చేరింది. ఒక్కరోజులో 3,116 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 53,889 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,57,53,679 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.



Previous
Next Post »
0 Komentar

Google Tags