Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 21-04-2021

 

AP Covid-19 Media Bulletin 21-04-2021

ఏపీలో 9716 కొత్త కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 39,619 పరీక్షలు నిర్వహించగా, 9,716 కేసులు నిర్ధారణ కాగా, 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,86,703 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 

కృష్ణా జిల్లాలో అత్యధికంగా పది మంది ప్రాణాలో కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు, తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున; చిత్తూరు, ప్రకాశంలో ముగ్గురేసి; గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున; అనంతపురంలో ఒక్కరు కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,510కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,359 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,18,985కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,57,93,298 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా శ్రీకాకుళంలో 1,444, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి.



Previous
Next Post »
0 Komentar

Google Tags