Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

 

తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడనుందని తెలిపారు.

గత కొన్ని రోజులుగా అకాల వర్షాల తరువాత ఎండలో మళ్లీ పెరగనున్నాయి. ఎండలో బయటికి వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురవడంతో చల్లబడిన వాతావరణం.. ఇప్పుడు మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ర్టంలో రాగ‌ల మూడు రోజుల్లో పొడి వాతావ‌ర‌ణం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

రేపు, ఎల్లుండి గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. సాధార‌ణం క‌న్నా 2 – 3 డిగ్రీలు అధికంగా న‌మోదయ్యే అవ‌కాశం ఉంది. ఇక ద‌క్షిణ ఒడిశా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం బ‌ల‌హీన ప‌డింది. విద‌ర్భ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డింది. మ‌ర‌ట్వాడా, క‌ర్ణాట‌క మీదుగా త‌మిళ‌నాడు వ‌ర‌కు ద్రోణి కొన‌సాగుతోంది. స‌ముద్ర మ‌ట్టానికి 0.9 కిలోమీట‌ర్ల ఎత్తున ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డింది. దీంతో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags