Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CSE, ఉపాధ్యాయ సంఘాలతో నిన్న జరిగిన చర్చల ముఖ్యాంశాలు - మొబైల్‌లో ఉపాధ్యాయుల హాజరు నమోదు

 


CSE, ఉపాధ్యాయ సంఘాలతో నిన్న జరిగిన చర్చల ముఖ్యాంశాలు - మొబైల్‌లో ఉపాధ్యాయుల హాజరు నమోదు 

ఉపాధ్యాయుల హాజరును మొబైల్‌ ఫోన్‌లోనే నమోదు చేసేలా యాప్‌ను రూపొందిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు వెల్లడించారు. యాప్‌ల వినియోగానికి సంబంధించి వారం, పది రోజుల్లో మరో సమావేశం నిర్వహించనున్నట్లు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన తెలిపారు.

సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు

- నెలవారీ పదోన్నతుల్లో కేటగిరి 3, 4 మాత్రమే భర్తీ చేస్తారు.

- కొవిడ్‌-19 బారినపడిన ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవులు.

- అర్హులైన ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాధికారులుగా పదోన్నతి.

- ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పోస్టులను డీఎస్సీలో భర్తీ చేయడమా? లేదంటే అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించడమా? అనే దానిపై త్వరలో నిర్ణయం.

- పాఠశాలలు జులై 1న పునఃప్రారంభం.

- మండల విద్యాధికారుల బదిలీలపై త్వరలో నిర్ణయం

Previous
Next Post »
0 Komentar

Google Tags