Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

దేశంలో కరోనా ఉద్ధృతి, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జాతినుద్దేశించి మోదీ ప్రసంగం 20-04-2021

 

దేశంలో కరోనా ఉద్ధృతి, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జాతినుద్దేశించి మోదీ ప్రసంగం 

దేశంలో కరోనా ఉద్ధృతి, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు . కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నందున ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మరికొన్నిచోట్ల వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం లోని ముఖ్యాంశాలు:

* కొవిడ్‌ రెండో వేవ్ తుపానులా‌ విరుచుకుపడుతోందని, ఈసారి అది మరింత తీవ్రమైన సవాలు విసురుతోందని అన్నారు.

* కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నామని చెప్పారు.

* కరోనా సంక్షోభం నుంచి మనం తప్పక బయటపడాలన్నారు.

* దేశంలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయమిది.

* ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి.

* దేశం నలుమూలలా ఆక్సిజన్‌ కొరత ఉంది. ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. సరిపడా ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం అనే ప్లాంట్లు నెలకొల్పాం.

* వైద్య అవసరాల కోసం ఉత్పత్తి పెంచాం. ఫార్మా సంస్థలు త్వరితగతిన ఔషధాల ఉత్పత్తిని పెంచాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఔషధ సంస్థలు భారత్‌లో ఉన్నాయి. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదు.

* దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడాలి. లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే పరిగణించాలి’’ అని చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags