Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

సీఎం ఆమోదానికి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ దస్త్రం

 

సీఎం ఆమోదానికి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ దస్త్రం

తెలంగాణ ఉద్యోగుల కొత్త వేతన సవరణకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. 30 శాతం ఫిట్ మెంటు పెంపుదలతో ఆర్థిక శాఖ ప్రతిపాదనలు రూపొందించి సీఎం ఆమోదానికి పంపింది. ఆయన సంతకం చేసిన అనంతరం దానిపై పీఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా తదుపరి నెలకు సంబంధించిన వేతన బిల్లులు ఈ నెల 20వ తేదీలోపు సిద్ధం కావాలి.

తాజాగా పీఆర్సీకి సంబంధించి ప్రతిపాదనలపై సీఎం సంతకం అనంతరం ఉత్తర్వుల జారీకి రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చేనెల నుంచి పెంపుదల అమల్లోకి వస్తుంది. బిల్లుల తయారీకి సమయం సరిపోని పక్షంలో జూన్ నెల నుంచి వేతనాల పెంపుదల అమల్లోకి రావచ్చు. అప్పుడు మే నెల వేతనాన్ని బకాయిగా చెల్లిస్తారని తెలుస్తోంది.

పీఆర్సీ జీవోలు జారీ అయిన తరువాత ఆర్థికశాఖ, నిపుణులతో కూడిన అనామలీస్ (పరిష్కారాల) కమిటీని ఏర్పాటు చేయనుంది. పీఆర్సీ ఉత్తర్వులు వచ్చిన తరువాత తలెత్తే సందేహాల నివృత్తి పై ఈ కమిటీ దృష్టి సారించనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags