Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రైవేట్‌ టీచర్లకు ఈనెల (ఏప్రిల్) నుంచే సాయం

 

TS: ప్రైవేట్‌ టీచర్లకు ఈనెల (ఏప్రిల్) నుంచే సాయం

ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్‌ నుంచే సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

దాదాపు 1.45లక్షల మంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని అంచనా వేయగా.. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రేషన్‌ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రుల సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లును మంత్రులు ఆదేశించారు. 

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు తిరిగి తెరిచే వరకు వారికి రూ. 2000 ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం నేపథ్యంలో మంత్రులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

Previous
Next Post »

1 comment

Google Tags