Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

2,118 Branches of State-Run Banks Closed or Merged in Last Fiscal: RTI Reply

 

2,118 Branches of State-Run Banks Closed or Merged in Last Fiscal: RTI Reply

2 వేలకు పైగా బ్యాంక్ బ్రాంచులు మూసివేత లేదా విలీనం అయ్యాయి – అసలు కారణమిదే!

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక విషయాన్ని ప్రకటించింది. సమాచార హక్కు చట్టం RTI కింద ఒక అంశాన్ని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంతవ్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్యాంక్ బ్రాంచులు క్లోజ్ అయినట్లు తెలిపింది. 

ఈ బ్యాంక్ బ్రాంచులు శాశ్వతంగా క్లోజ్ కావొచ్చు. లేదంటే ఇతర బ్యాంక్ బ్రాంచులుగా మారిపోయి ఉండొచ్చు. అయితే ఈ అంశంపై స్పష్టత లేదు. బ్యాంకుల విలీనం కారణంగా ఈ స్థాయిలో బ్యాంక్ బ్రాంచులు క్లోజ్ కావడం గమనార్హమని చెప్పుకోవచ్చు. ఈ 2118 బ్రాంచుల్లో ఏ బ్యాంక్ బ్రాంచులు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెంది 1283 బ్రాంచులు ఉన్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI 332 బ్రాంచులు కలిగి ఉంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు PNB 169 బ్రాంచులు ఉన్నాయి. ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 124 బ్రాంచులను, కెనరా బ్యాంక్ 107 బ్రాంచులను, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 53 బ్రాంచులను, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43 బ్రాంచులను, ఇండియన్ బ్యాంక్ 5 బ్రాంచులను కలిగి ఉన్నాయి. 

కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ పది బ్యాంకులు 4 బ్యాంకులుగా ఆవిర్భవించాయి. దీంతో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు దిగివచ్చింది. కాగా బ్యాంకుల విలీనం వల్ల బ్రాంచులు తగ్గడం బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని, ఉపాధి తగ్గుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags