Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 19-05-2021

 

AP Covid-19 Media Bulletin 19-05-2021

ఏపీలో కొత్తగా 23,160  కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేలపైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,01,330 నమూనాలను పరీక్షించగా 23,160 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

అలాగే, కొత్తగా 106 మంది మృతిచెందగా, మరో 24,819మంది కోలుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,82,41,637శాంపిల్స్‌ పరీక్షించగా, 14,98,532మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 12,79,110మందికోలుకొని డిశ్చార్జి కాగా, 9686మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,736 క్రియాశీల కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 17మంది కొవిడ్‌తో మృతిచెందగా, విశాఖ, నెల్లూరులో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున; అనంతపురం, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మృత్యువాతపడ్డారు. గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

AP BULLETIN 19-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags