Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 25-05-2021

 

AP Covid-19 Media Bulletin 25-05-2021

ఏపీలో కొత్తగా 15, 284  కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 72,979 నమూనాలను పరీక్షించగా, 15,284 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 16,09,105కి చేరింది. తాజాగా మరో 106 మంది కరోనాకు బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 10,328కిపెరిగింది. తాజాగా 20,917 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు 1,87,49,201 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. 

కరోనా మహమ్మారి వల్ల చిత్తూరులో అత్యధికంగా 15 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమగోదావరిలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి,నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

AP BULLETIN 25-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags