Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Govt Decided to Implement English Medium Degree Courses

 

AP Govt Decided to Implement English Medium Degree Courses

ఏపీ: డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్‌ మీడియంలోనే - 2021-22 విద్యాసంవత్సరం నుంచి అమలు

బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సులన్నింటిలో ఇంగ్లిష్‌ మీడియమే అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్‌ మీడియంలోనే

వచ్చే విద్యాసంవత్సరం (2021-22) నుంచి అమలు

సిలబస్‌లో కూడా మార్పులు చేర్పులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2021– 22) నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సులన్నింటిలో ఇంగ్లిష్‌ మీడియమే అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. 

ఇంజనీరింగ్‌ తదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) ప్రొఫెషనల్‌ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన నిర్వహిస్తుండగా నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో మాత్రం పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమం అమలు కావడం లేదు. ఇంగ్లీషు మీడియంలో డిగ్రీ పూర్తిచేసిన వారితో పోలిస్తే తెలుగు మీడియంలో చదివిన వారు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. 

ఫలితంగా డిగ్రీ చదివినా నిరుద్యోగులుగా లేదంటే చిన్నా చితకా పనులు చేస్తూ జీవనం సాగించాల్సి వస్తోంది. అయితే ప్రస్తు పోటీ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకే మొగ్గు చూపుతున్నారు. టెన్త్, ఇంటర్‌ తెలుగు మీడియంలో చదివిన వారు సైతం డిగ్రీ నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. 

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 4,24,937 సీట్లు ఉండగా ఈ ఏడాది 2,62,805 మంది విద్యార్థులు చేరారు. వీరిలో తెలుగు మీడియం వారు 65,989 మంది ఉండగా ఇంగ్లీషు మీడియంలో చేరిన విద్యార్థులు 1,96,816 మంది ఉండటం విశేషం. 

ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం:

ఏపీలో వచ్చే విద్యాసంవత్సరం (2020-21) నుంచి అన్ని డిగ్రీ కోర్సులను ఇంగ్లిష్‌ మీడియంలోనే అందించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం లక్ష్యంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నామని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags