Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: 10వ తరగతి పరీక్షలు-2021 వాయిదా

 


ఏపీ: 10వ తరగతి పరీక్షలు-2021 వాయిదా

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉండటం.. కేసుల సంఖ్య దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించే అవకాశముండటంతో పరీక్షల నిర్వహణపై చర్చించారు.

* ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు సర్కార్ తెలిపింది.

* పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా, ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

* దీంతో పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

* ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

* టీచర్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది.

* పరీక్షలపై ప్రభుత్వం మళ్లీ జూలైలో సమీక్ష చేయనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags