Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP & TS Covid-19 Media Bulletins 13-05-2021

 

AP & TS Covid-19 Media Bulletins 13-05-2021

ఏపీలో 22,399 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో 4,693 కొత్త కరోనా కేసులు


ANDHRA PRADESH:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరోసారి 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 96,446 శాంపిల్స్‌ పరీక్షించగా 22,399 మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌తో బాధపడుతూ 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 9,077కి చేరింది. 

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 13,66,785 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,77,02,133 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఇక 18,638 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, మొత్తం 11,56,666 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,01,042 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

గత 24 గంటల్లో విశాఖపట్నంలో 11 మంది, విజయనగరంలో 11 మంది, చిత్తూరులో తొమ్మిది మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, కృష్ణలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడపలో నలుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు కరోనాతో మరణించారు.

AP BULLETIN 13-05-2021

 

TELGANGANA:

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  71,221 నమూనాలను పరీక్షించగా, 4,693 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. తాజాగా 33 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. ఇవాళ 6,876 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో 56,917 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 734 కేసులు నమోదయ్యాయి.

TS BULLETIN 13-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags