Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BCCI to Conduct Remaining Matches of VIVO IPL in UAE

 

BCCI to Conduct Remaining Matches of VIVO IPL in UAE

IPL 2021: మిగతా మ్యాచ్‌లు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం

యూఏఈలో మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ 2021 రెండో షెడ్యూల్‌ పై బీసీసీఐ వర్చువల్ సమావేశం నిర్వహించింది. సౌరభ్ గంగూలీ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ భేటీలో, విదేశీ ఆటగాళ్ల అందుబాటు విషయమై విదేశీ క్రికెట్ బోర్డులతో మాట్లాడాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

టీ-20 ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించి జూన్ 1న ఐసీసీతో జరగనున్న భేటీలో మరింత సమయం కోరనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మ్యాచ్ నిర్వహణ తేదీల్ని మాత్రం బీసీసీఐ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్య నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags