Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google, Reliance Jio working closely to launch affordable smartphone in India: Sundar Pichai

 

Google, Reliance Jio working closely to launch affordable smartphone in India: Sundar Pichai

త్వరలో చౌకధరలో గూగుల్‌-జియో స్మార్ట్‌ఫోన్లు: సుందర్‌ పిచాయ్‌

చౌకధరలో స్మార్ట్‌ఫోన్ తయారీ కోసం జియో ప్లాట్‌ఫాంతో కలిసి చేపట్టిన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతానికి చెందిన కొంతమంది విలేకరులతో ఆయన నేడు వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘అందుబాటు ధరలో ఫోన్‌ తయారీపై దృష్టిపెట్టాం. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం మా భాగస్వామి జియోతో కలిసి పనిచేస్తున్నాం’’ అని పిచాయ్‌ వివరించారు. 

అయితే స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారు.. ధర.. డేటా రేట్లు వంటి ఇతర వివరాలను మాత్రం పిచాయ్‌ వెల్లడించలేదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫాంలో గూగుల్‌ భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.  రూ. 33,737 కోట్లు చెల్లించి జియోలో 7.7శాతం వాటాను గూగుల్‌ సొంతం చేసుకుంది. ఆ సమయంలోనే జియోతో కలిసి చౌక ధరలో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నట్లు రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. 

గూగుల్ ఫర్‌ ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌’ పేరుతో వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్‌లో 10 బిలియన్‌ డాలర్ల(రూ. 75వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు పిచాయ్‌ గతేడాది జులైలో ప్రకటించారు. ఇందులో భాగంగానే జియోలో వాటాను గూగుల్‌ కొనుగోలు చేసింది. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు పిచాయ్‌ వెల్లడించారు. వాటికి సంబంధించి వివరాలను ఈ ఏడాది చివర్లో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది తొలి బీటా వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రైవసీ సెట్టింగ్స్‌లోనూ కొత్త మార్పులు తీసుకొస్తున్నామన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags