Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sundeep Kishan Offer Help Children Who Have Lost Their Parents Due to Covid-19

 

Sundeep Kishan Offer Help Children Who Have Lost Their Parents Due to Covid-19

కోవిడ్ -19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సందీప్‌ కిషన్‌ సహాయం

కరోనా వల్ల దేశంలో దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ సెకండ్ వేవ్ లో ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల పెద్ద దిక్కును కోల్పోయి అభం శుభం తెలియని పసివాళ్లు అనాథలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సినిమా ప్రముఖులు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. తాజాగా.. యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌  తన ఉదారత చాటుకున్నారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేశారు. 

‘‘ఇది కఠినమైన సమయం. కరోనా వల్ల పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల వివరాలు నాకు పంపించండి. నేను, నా టీమ్‌ కలిసి మాకు చేతనైనంత వరకు వాళ్లను సంరక్షిస్తాం. మంచి ఆహారం అందించడంతో పాటు కొన్నేళ్లు వారిని చదివిస్తాం. మానవత్వం కలిగిన మనుషులుగా ఒకరికొకరు అండగా నిలవాల్సిన సమయం ఇది. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తలు పాటించండి.. మీరు కూడా మీకు తోచినంత సాయం చేయండి’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అనాథ బాలల వివరాలు తనకు మెయిల్‌ చేయాలంటూ.. మెయిల్‌ అడ్రస్‌ sundeepkishancovidhelp@gmail.com ఇచ్చారు.

నటి శ్రుతిహాసన్‌ కూడా బాలల సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags