Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: మాస్కులు లేనివారిపై 3.39 లక్షల కేసులు - ₹31కోట్ల జరిమానా

 

TS: మాస్కులు లేనివారిపై 3.39 లక్షల కేసులు - ₹31కోట్ల జరిమానా

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. డీజీపీతోపాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు విచారణకు హాజరయ్యారు. కరోనా నిబంధనల అమలుపై నివేదకను కోర్టుకు సమర్పించారు. “ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 98 కేసులు నమోదు చేశాం. మాస్కులు లేనివారిపై 3,39,412 కేసులు నమోదు చేయగా, జరిమానా కింద రూ.31 కోట్లు వసూలయ్యాయి. భౌతికదూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశాం. లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం"అని డీజీపీ కోర్టుకు తెలిపారు. దీంతో పోలీసుల పనితీరును హైకోర్టు ప్రశంసించింది. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది.

ప్రభుత్వ దవాఖాన వద్ద 57 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేశాం. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసుల పనితీరును అభినందించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags