Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు – కానీ స‌డ‌లింపు స‌మ‌యం పెంపు

 

ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు కానీ స‌డ‌లింపు స‌మ‌యం పెంపు

ఏపీలో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతున్న నేపథ్యంలో ప‌గ‌టి కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌ర్ఫ్యూను ఈ నెల 20 వ‌ర‌కు పొడిగించారు. కాగా, స‌డ‌లింపు స‌మ‌యాన్ని పెంచారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉద‌యం ఆరు నుంచి మధ్యాహ్నం 12 వ‌ర‌కు ఉన్న స‌డ‌లింపు స‌మయం.. ఈ నెల 11 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు 10వ‌ తేదీతో ముగియ‌నున్న నేప‌థ్యంలో సీఎం వివిధ శాఖల అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో దీనిపై నిర్ణ‌యం తీసుకున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags