Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలోని 8 జిల్లాల్లో జులై 1 నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు

 

ఏపీలోని 8 జిల్లాల్లో జులై 1 నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు

ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను మరింతగా సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. కొవిడ్‌ పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సడలింపు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఈ సడలింపు సమయం వర్తించనుంది. ఈ ఐదు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నట్లే సాయంత్రం ఆరు గంటల వరకే సడలింపు ఉంటుంది. జులై 1 నుంచి 7 వరకు తాజా నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఐదు జిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags