Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Karnam Malleswari made first Vice-Chancellor of Delhi Sports University

 

Karnam Malleswari made first Vice-Chancellor of Delhi Sports University

ఢిల్లీ స్పోర్ట్స్‌ వర్సిటీ తొలి వీసీగా కరణం మల్లీశ్వరి నియామకం

ఒలింపిక్‌ పతక విజేతగా, వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సిక్కోలు బిడ్డ కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. మల్లీశ్వరిని ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం తొలి వైఎస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ అజ్మిల్‌ హఖ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ ఢిల్లీ జిల్లాలోని ముండ్కా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. మరో పదేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. 

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ, తెలుగింటి ఆడపడుచైన మల్లీశ్వరికియ ఈ అవకాశం రావడం పట్ల శ్రీకాకుళం జిల్లా క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస పట్టణ పరిధిలోని ఊసవానిపేట ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ పొంది అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో పతకాలను సాధించారు. తమ ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి ఉన్నత స్థానాన్ని పొందడంపై ఊసవానిపేట గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కరణం మల్లీశ్వరి ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలో వెయిట్‌ లిప్టింగ్‌ అకాడమీ నెలకొల్పేందుకు సన్నాహాలు జరిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ అరుదైన అవకాశం లభించడం పట్ల జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, జిల్లా ఒలింపిక్‌ వెయిట్‌ లిప్టింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఇప్పిలి అప్పన్న, తదితరులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags