Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలకు ఊరట - అనుబంధ గుర్తింపు ప్రక్రియలో పలు మినహాయింపులు

 

TS: ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలకు ఊరట - అనుబంధ గుర్తింపు ప్రక్రియలో పలు మినహాయింపులు

కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని సుమారు 1,800 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు ఊరటనిచ్చింది. అనుబంధ గుర్తింపు ప్రక్రియలో పలు మినహాయింపులను ఇస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 మీటర్లలోపు ఎత్తు భవనాల్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల గుర్తింపును ఆటో రెన్యువల్‌ చేయాలని నిర్ణయించింది.

అనుబంధ గుర్తింపు రుసుమును ఈ ఏడాది 33 శాతం పెంచాలన్న నిర్ణయాన్ని సైతం ఉపసంహరించుకుంది. గతేడాది ఫీజులతోనే కాలేజీల గుర్తింపును పునరుద్ధరించనున్నట్లు బోర్డు ప్రకటించింది. శానిటరీ, నిర్మాణ సామర్థ్య ధ్రువీకరణ పత్రాలు, 33 శాతం సిబ్బంది వివరాలను 90 రోజుల్లో సమర్పించేందుకు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. 

15 మీటర్లకు మించి ఎత్తు ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్న కాలేజీలు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. తాజా మినహాయింపుల నేపథ్యంలో అనుబంధ గుర్తింపు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును బోర్డు మరోసారి పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రూ.5వేలు ఆలస్య రుసుంతో జులై 7 వరకు, రూ.10వేలతో జులై 14 వరకు, రూ.15వేలతో జులై 22 వరకు, రూ.20వేలతో జులై 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

కరోనా వేళ తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని మినహాయింపులు ఇచ్చినందుకు రాష్ట్ర జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు గౌరీ సతీష్ ప్రభుత్వానికి, ఇంటర్ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags