Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CET-2021) తేదీలు విడుదల

 

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CET-2021) తేదీలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌ను ఆగస్టు 19 నుంచి 25 వరకు కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ను సెప్టెంబర్‌ 17, 18న విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 19న ఈసెట్‌ (అనంతపురం జేఎన్‌టీయూ), సెప్టెంబర్‌ 21న ఎడ్‌సెట్‌ (విశాఖ ఏయూ) పరీక్షలు జరగనున్నాయి.

తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 22న లాసెట్‌, సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈఏపీ సెట్‌:  ఆగస్టు 19 నుంచి 25 వరకు

ఐసెట్‌: సెప్టెంబర్‌ 17, 18

ఈసెట్‌: సెప్టెంబర్‌ 19

ఎడ్‌సెట్‌: సెప్టెంబర్‌ 21

లాసెట్‌: సెప్టెంబర్‌ 22

పీజీఈ సెట్‌: సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు

Previous
Next Post »
0 Komentar

Google Tags