Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Schools: ఆగస్టు 16 నుంచి పాఠశాలల ప్రారంభం - ఈ నెలాఖరు లోపు ఇంటర్‌ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ

 

AP Schools: ఆగస్టు 16 నుంచి పాఠశాలల ప్రారంభం-ఈ నెలాఖరు లోపు ఇంటర్‌ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు- నేడు పెండింగ్‌ పనుల పూర్తికి సీఎం ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్‌ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. 

పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నూతన విద్యావిధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందన్నారు. దీని వల్ల ఏ స్కూల్‌ మూతపడదని.. ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదని సురేష్‌ వివరించారు. రెండేళ్లలో ఫౌండేషన్‌ స్కూళ్లకు అదనపు గదులను నిర్మిస్తామన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు 70 శాతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కులు.. పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరు లోపు ఇంటర్‌ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags