Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS SCCL: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు

 

TS SCCL: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రాంతానికి చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు.

కార్మిక సంఘాలు, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయసు 61ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సంస్థలో మొత్తంగా 43,899 మంది ఉద్యోగులు, అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 26న జరగనున్న బోర్డు సమావేశంలో దీనిపై సమీక్షించి పెంపు అమలు తేదీని ప్రకటించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags