Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Karnataka: Seven People Test Positive for New Covid Variant 'AY 4.2'

 

Karnataka: Seven People Test Positive for New Covid Variant 'AY 4.2'

కర్ణాటకలో కరోనా డెల్టా ప్లస్‌ ఏవై.4.2 కేసులు

బ్రిటన్‌, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనం కేసులను కర్ణాటకలో గుర్తించారు. పలువురి రక్త, ఇతర నమూనాలను రెండురోజుల కిందట పరీక్షలకు పంపగా.. బుధవారం ఆ వివరాలు వెల్లడయ్యాయి. ఏకకాలంలో ఏడుగురికి ఈ వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఈ కేసుల్లో రెండింటికి ఏవై.4.2 లక్షణాలున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ రణదీప్‌ వెల్లడించారు. ఏడుగురిలో ముగ్గురు బెంగళూరుకు చెందినవారు, నలుగురు ఇతర జిల్లాలవారు. ఈ వైరస్‌ వల్ల మరణాలేవీ సంభవించలేదు. కొత్త వైరస్‌ వ్యాప్తి సంకేతాల నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై మళ్లీ ఆంక్షలు విధించాలని సంబంధిత శాఖలకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీచేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags