Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PM Modi: జాతినుద్దేశించి మోదీ ప్రసంగం (22-10-2021) – ముఖ్యాంశాలు ఇవే

 

PM Modi: జాతినుద్దేశించి మోదీ ప్రసంగం (22-10-2021) – ముఖ్యాంశాలు ఇవే

ప్రధాని నరేంద్రమోదీ కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉదయం 10 గంటలకు ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ ప్రసంగించారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రస్థానం జనవరి 16న మొదలై.. 279వ రోజున శతకోటి మలుపు చేరుకొంది. దీంతో నిత్యం సగటున 35,84,223 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్టయింది. ఇప్పటివరకూ సుమారు 70% మందికి ఒక డోసు, 31% మందికి రెండు డోసులు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రసంగం లోని వివరాలు ఇవే:

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌ చేపట్టిన బృహత్తర టీకా కార్యక్రమం కీలక మైలురాయిని దాటింది. కేవలం తొమ్మిదంటే 9 నెలల్లోనే దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి అరుదైన కీర్తి గడించింది. అయితే ‘శతకోటి’ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఎన్నో అవాంతరాలు, మరెన్నో సవాళ్లను దాటుకుని ఈ ఘనత చేరుకున్నాం. అందుకే ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. టీకా పంపిణీలో 100 కోట్ల మార్క్‌ను దాటిన సందర్భంగా ప్రధాని మోదీ ‘టీమిండియా - సవాళ్లకు లక్ష్యంతో సమాధానం’ అనే టైటిల్‌తో ఓ హిందీ పత్రికలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

ఆందోళన నుంచి భరోసా వరకు చేరుకున్న ఈ ప్రయాణంతో దేశం మరింత బలమైందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీకాలపై ఎన్ని అపోహలు సృష్టించినా, గందరగోళ పరిస్థితులు ఎదురైనా.. దేశ ప్రజల విశ్వాసంతోనే ఈ విజయం సాధించగలిగామన్నారు. ‘‘ఇది నాది అని ప్రతిఒక్కరూ అనుకున్నప్పుడు.. ఏదీ అసాధ్యం కాదు. దేశ ప్రజలందరికీ టీకాలు అందించాలన్న లక్ష్యంతో మన ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమించారు. కొండలు ఎక్కి.. నదులు దాటారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించారు. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, యువత కలిసికట్టుగా పనిచేశారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో టీకాపై సంకోచాలు కాస్త తక్కువే ఎదురయ్యాయి’’ అని మోదీ రాసుకొచ్చారు. 

‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. 

టీకాల సామర్థ్యంపై ఎన్నో అనుమానాలు ఎదురైనా కేవలం 9 నెలల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామని మోదీ అన్నారు. టీకా కార్యక్రమంలో ఎలాంటి వీఐపీ సంప్రదాయాలను తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా వ్యాక్సిన్‌ను అందజేయగలుగుతున్నామన్నారు. టీకాలు, ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసం కారణంగానే ఈ రోజు ఈ ఘనత సాధించామన్నారు. స్వదేశీ టీకాలపై ప్రజలు నమ్మకం ఉంచడం చాలా సంతోకరమైన విషయమన్నారు. ‘‘టీకా పంపిణీ ప్రారంభించిన తొలినాళ్లలో 130 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటే 3-4 ఏళ్లు పడుతుందని కొందరు అన్నారు. అసలు టీకాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకురారని అన్నవాళ్లూ ఉన్నారు. వాటన్నింటికీ నేడు తగిన సమాధానం ఇచ్చాం’’ అని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags