Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP NMMS 2021-22: All the Details Here

 

AP NMMS 2021-22: All the Details Here

=================

UPDATE 20-07-2022

AP NMMS: పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు తమ పేర్లను నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో నమోదుకి సంభందించిన ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే

పత్రికా ప్రకటన

మార్చి 2022 లో నేషనల్ మీన్స్ - కం - మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) నందు తమ వివరములను నమోదు చేసుకొనుటకు చివరి తేది 30.09.2022 మరియు స్కూలు లెవల్ లో ధ్రువీకరణకు చివరి తేది 16.10.2022 అని జాతీయ మానవ వనరుల శాఖ వారు తెలియజేసారు.

లేని యెడల వారికి ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాబడదు. ఫిబ్రవరి 2021, నవంబరు 2019, 2018 సంవత్సరములలో ఎంపిక ప్రభుత్వ పాఠశాలలో / కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు.

కావున ఎంపిక అయిన ప్రతీ విద్యార్ధి ఎట్టి పరిస్థితులలోనూ పోర్టల్ నందు తమ వివరములను నమోదు చేసుకొని స్కాలర్షిప్ పొందగలరు. పూర్తి వివరములు కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో సంప్రదించగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.

CLICK FOR PRESS NOTE

NSP WEBSITE

=================

UPDATE 04-07-2022

20-03-2022 న నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) ఫలితములు విడుదల చేయబడినవి. ఫలితముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని లేదా ఈ కార్యాలయపు వెబ్ సైటు ద్వారా గాని తెలుసుకొనవచ్చును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.

CLICK FOR NMMS RESULTS

CLICK FOR SELECTED STUDENT LIST

PRESS NOTE 04-07-2022

WEBSITE

=================

UPDATE 29-03-2022

CLICK FOR FINAL KEY

PRESS NOTE ON FINAL KEY

=================

UPDATE 21-03-2022

20-03-2022 న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన “ప్రాథమిక కీ” 21-03-2022 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ నందు ఉంచబడును. "ప్రాథమిక కీ” విషయంలోని అభ్యంతరములు 26-03-2022 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ వెబ్సైట్లో గల NMMS గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్లో స్వీకరించబడును.

అభ్యంతరములను పరిశీలించిన పిదప “తుది కీ” కార్యాలయపు వెబ్సైటు నందు ఉంచబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.

CLICK FOR INITIAL KEY

PRESS NOTE ON INITIAL KEY

CLICK FOR OBJECTIONS

WEBSITE

=================

UPDATE 20-03-2022

AP NMMS Question Papers -2022 – Conducted on 20-03-2022 with Answers

CLICK HERE

=================

UPDATE 10-03-2022

2021-22 విద్యా సంవత్సరమునకు గాను జరుగవలసిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) మార్చి నెల మూడవ ఆదివారం అనగా 20-03-2022 న జరుగును.

DOWNLOAD HALL TICKETS

DOWNLOAD HALL TICKETS SCHOOL WISE

PRESS NOTE ON HALL TICKETS

WEBSITE

=================

UPDATE 10-02-2022

NMMS పరీక్ష కు సంబంధించి అప్లికేషన్ లో మాధ్యమం మార్పు గురించి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి పత్రికా ప్రకటన.

2021-22 విద్యా సంవత్సరమునకు గాను జరుగవలసిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) మార్చి నెల మూడవ ఆదివారం అనగా 20-03-2022 న జరుగును. ఈ పరీక్షకు నమోదు చేసుకున్న విద్యార్థుల యొక్క దరఖాస్తులో పరీక్ష వ్రాసే మాధ్యమం (మీడియం) లో ఏమయినా మార్పులు ఉన్నట్లయితే సవరించుకొనుటకు 10-02-2022 నుండి 13-02-2022 వరకు అవకాశం ఇవ్వబడినది.

కావున మాధ్యమం (మీడియం) మార్చుకొనదలచిన విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయులను సంప్రదించి పైన తెలిపిన తేదీలలో స్కూల్ లాగిన్ లో ఇప్పబడిన లింకు ద్వారా మీడియం సవరించుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.

CLICK FOR PRESS NOTE 10-02-2022

=================

UPDATE 27-01-2022

2022వ సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) ఫీజు గడువును 11-02-2022 వరకు పొడిగించడమైనది.

PRESS NOTE TELUGU 27-01-2022

PRESS NOTE ENGLISH 27-01-2022

APPLICATION

=================

2022వ సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు.

పరీక్ష రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ. 50/-లు. దరఖాస్తులను ఆన్ లైన్ లో 27-12-2021 నుండి స్వీకరించబడును. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 27-01-2022 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 29-01-2022. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు నందు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-12-2021

దరఖాస్తు చివరి తేదీ: 27-01-2022  09-02-2022

పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ: 29-01-2022  11-02-2022

APPLY HERE

USER GUIDE FOR APPLICATION

PRESS NOTE ENGLISH

PRESS NOTE TELUGU

WEBSITE

=================

NMMS-NTSE Study Materials 👇

CLICK HERE

NMMS Previous Question Papers 👇

CLICK HERE

NMMS Model Grand Test Papers 👇

CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags