Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Padma Awards 2022: Full List of Padma Vibhushan, Padma Bhushan, Padma Shri Recipients

 

Padma Awards 2022: Full List of Padma Vibhushan, Padma Bhushan, Padma Shri Recipients

పద్మ అవార్డులు-2022: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ గ్రహీతల పూర్తి జాబితా ఇదే

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. 2022 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్‌ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. 

కొవిడ్‌ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులను పద్మభూషణ్‌ పురస్కారం వరించింది. అలాగే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు పశ్చిమబెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొవిషీల్డ్‌ టీకా తయారు చేసిన సీరమ్‌ సంస్థ ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా, ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. 

తెలుగు ‘పద్మ’లు వీరే..

తెలుగు రాష్ట్రాలను ఈసారి మొత్తంగా ఏడు పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి నలుగురికి, ఏపీ నుంచి ముగ్గురికి ఈ అవార్డులు దక్కాయి. భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు (సంయుక్తంగా) పద్మ భూషణ్‌ పురస్కారానికి ఎంపిక కాగా.. పద్మశ్రీ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి గోసవీడు షేక్‌ హసన్ ‌(కళారంగం‌); డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం‌); గరికపాటి నరసింహారావు ఉండగా..  తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు‌), రామచంద్రయ్య (కళలు),  పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.  

* ప్రముఖ నటి షావుకారు జానకి గారికి తమిళనాడు తరపున 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించారు.

* తనకి వచ్చిన పద్మ భూషణ్ పురస్కారాన్ని బుద్ధదేవ్ భట్టాచార్జీ తిరస్కరించినట్టు సమాచారం.

CLICK FOR THE FULL LIST OF AWARDEES

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags