Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 05-01-2022

 

TS Covid-19 Media Bulletin 05-01-2022

తెలంగాణలో కొత్తగా 1,520 కరోనా కేసులు

తెలంగాణలో కొవిడ్‌ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. వరుసగా రెండోరోజూ రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 42,531 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,520 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,034కు చేరింది. కరోనా నుంచి నిన్న 209 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,168 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

గడిచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 13,652 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 207 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 45 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా తేలింది. మిగిలిన 162 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్‌ బాధితుల్లో 43 మంది కోలుకున్నారు. మరో 68 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఒమిక్రాన్‌ బారిన పడిన వారిలో రిస్క్‌ దేశాల నుంచి 19 మంది, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 39 మంది ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

TS BULLETIN 05-01-2022

DISTRICT WISE BULLETIN

Previous
Next Post »
0 Komentar

Google Tags