Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఈ నెల 24 నుంచి ఈ 10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు – ఉపాధ్యాయులు రోటేషన్ పద్ధతిలో విధులకు హాజరు

 

TS: ఈ నెల 24 నుంచి ఈ 10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు ఉపాధ్యాయులు రోటేషన్ పద్ధతిలో విధులకు హాజరు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉదృతమవుతున్న నేపథ్యంలో  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు పొడిగించిన రాష్ట్ర విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది సైతం రోటేషన్ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరుకావాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, ఇవి అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags