Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIC Offers Opportunity for Policyholders to Revive Lapsed Policies

 

LIC Offers Opportunity for Policyholders to Revive Lapsed Policies

నిలిచిపోయిన వ్యక్తిగత జీవిత బీమా పాలసీల పునరుద్ధరణకు అవకాశం - వివరాలు ఇవే

భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (LIC) కీలక నిర్ణయం తీసుకుంది. నిలిచిపోయిన వ్యక్తిగత జీవిత బీమా పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 7న ప్రారంభమై.. మార్చి 25, 2022 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది.

కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నామైన నేపథ్యంలోనే పాలసీదారులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే మహమ్మారి మూలంగా బీమా రక్షణ ఎంత అవసరమో కూడా తెలిసొచ్చిందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలా పాలసీల పునరుద్ధరణకు అవకాశం ఇవ్వడం ఇది రెండోసారి.

పాలసీల పునరుద్ధరణకు ముందుకు వచ్చేవారికి ఆలస్య రుసుములో రాయితీ ఇస్తామని ఎల్‌ఐసీ తెలిపింది. పాలసీ మొత్తాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలకు ఆలస్య రుసుమును పూర్తిగా మినహాయిస్తున్నట్లు తెలిపింది. నిలిచిపోయిన ప్రీమియం విలువ రూ.1లక్ష వరకు ఉంటే ఆలస్య రుసుములో 20 శాతం, గరిష్ఠంగా రూ.2,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే ప్రీమియం మొత్తం రూ.3 లక్షలు మించితే.. ఆలస్య రుసుములో 30 శాతం, గరిష్ఠంగా రూ.3,000 వరకు రాయితీ ఇవ్వనున్నామని పేర్కొంది. ప్రీమియం నిలిచిపోయి ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ సమయం ఉన్న పాలసీలను మాత్రమే పునరుద్ధరించనున్నట్లు ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags