Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Civil Services 2021: Final Result Released

 

UPSC Civil Services 2021: Final Result Released

యూపీఎస్సీ సివిల్స్ -2021 తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ -2021 తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో శృతి శర్మకు మొదటి ర్యాంకు, అంకిత అగర్వాలకు రెండో ర్యాంకు, గామిని సింగ్లాకు మూడో ర్యాంకు వచ్చాయి.

ఈసారి అఖిల భారత సర్వీసులకు మొత్తం 685 మంది ఎంపిక కాగా.. జనరల్ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ కు 180, ఐపీఎస్ కు 200, ఐఎఫ్ఎస్ కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా.. మరో 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది.

సత్తా చాటిన తెలుగువాళ్లు.

మరోవైపు సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్ కుమార్ రెడ్డికి 15వ ర్యాంకు రాగా.. పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69), ఆకునూరి నరేశ్ (117), అరుగుల స్నేహ (186), బి. చైతన్యరెడ్డి (161), ఎస్. కమలేశ్వరరావు (297), విద్యామం శ్రీధర్ (336), దిబ్బడ ఎస్వీ అశోక్ (350), గుగులావత్ శరత్ నాయక్ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్ (564), బిడ్డి అఖిల్ (566), రంజిత్ కుమార్ (574), పాండు విల్సన్ (602), బాణావత్ అరవింద్ (693), బచ్చు స్మరణ్ రాజ్ (676) ర్యాంకులు సాధించారు.

========================

సివిల్స్ ర్యాంకర్ల జాబితా..👇

CLICK HERE

WEBSITE

======================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags