Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ పాఠశాలల పునః ప్రారంభ తేదీ మార్పు

 

ఏపీ పాఠశాలల పునః ప్రారంభ తేదీ మార్పు

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 4న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉంది. అయితే, జులై 4కు బదులు జులై 5న పాఠశాలలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జులై 4న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన దృష్ట్యా ఒక రోజు వాయిదా వేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

జులై 4న ప్రధానమంత్రి భీమవరంలో పర్యటించనున్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags