Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Nobel Prize 2022: Nobel Peace Prize for The Protection of Human Rights

 

The Nobel Prize 2022: Nobel Peace Prize for The Protection of Human Rights

‘పౌర  హక్కుల పరిరక్షణ’కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి – వివరాలు ఇవే

ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize).. పౌర హక్కుల (Human Rights) కోసం కృషి చేస్తోన్న ఓ వ్యక్తితో పాటు రెండు సంస్థలకు వరించింది. బెలారస్ (Belarus)కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాత్ స్కీ (Ales Bialiatski)తో పాటు రష్యా, ఉక్రెయిన్లకు చెందిన మానవ హక్కుల సంస్థలు 'మెమోరియల్, 'సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్'కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

పురస్కార గ్రహీతలు.. వారివారి దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పక్షాన్ని విమర్శించే హక్కుతోపాటు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఏళ్లుగా పోరాడుతున్నారు. హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం, యుద్ధ నేరాల నమోదులో అద్భుత పనితీరు కనబర్చారు. శాంతి, ప్రజాస్వామ్యాలతో కూడిన పౌర సమాజ ప్రాధాన్యాన్ని వారు చాటుతున్నారు' అని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. గతేడాది ఈ పురస్కారం.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషికి చేసిన జర్నలిస్టులు మరియా రెసా (ఫిలప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా)లకు దక్కిన విషయం తెలిసిందే.

బెలారస్ కు చెందిన అలెస్ బియాలియాత్ స్కే 1980ల్లో దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరు. ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. 2021 జులై నుంచి జైల్లో ఉన్నారు. మానవ హక్కుల సంస్థ 'మెమోరియల్.. రష్యాలో రాజకీయ అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలపై సమాచారాన్ని క్రమబద్ధంగా నమోదు చేసింది. కీ లోని 'సివిల్ లిబర్టీస్ సెంటర్'.. ఉక్రెయిన్ లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తోంది. పౌర సమాజాన్ని బలో పేతం చేయడంతోపాటు, ఉక్రెయిన్ ను పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు పోరాటం చేస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags