Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

పుస్తక మహోత్సవం: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు 33వ విజయవాడ పుస్తక మహోత్సవం

 

పుస్తక మహోత్సవం:  ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు 33 విజయవాడ పుస్తక మహోత్సవం

33 విజయవాడ పుస్తక మహోత్సవం ఈ నెల 9 నుంచి 19 వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు పుస్తక మహోత్సవ కమిటీ సమన్వయకర్త విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది దాదాపు 200 స్టాల్స్‌ ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని బుధవారం ఆయన తెలిపారు. 9వ తేదీన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.

ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం పుస్తకప్రియుల పాదయాత్ర ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది రాచమల్లు రామచంద్రారెడ్డి, ముదివర్తి కొండమాచార్య మూర్తి, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు శత జయంతి సభలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో పుస్తక మహోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బెల్లపు బాబ్జి, అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, కార్యదర్శి కె.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags