Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: పదవ తరగతి పరీక్షలు మరియు ఒంటిపూట బడుల గురించి విద్యాశాఖ మంత్రి మాట్లాడిన విషయాలు ఇవే...

 

AP: పదవ తరగతి పరీక్షలు మరియు ఒంటిపూట బడుల గురించి విద్యాశాఖ మంత్రి మాట్లాడిన విషయాలు ఇవే...

======================

మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం (ఏప్రిల్ 1) మీడియాతో వివిధ విషయాల గురించి మాట్లాడారు.

మంత్రి మాట్లాడిన విషయాలు ఇవే...

పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఆరు సబ్జెక్ట్లకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్టు వెల్లడించారు.

పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్ ప్రకటించాం. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు మొదలైనవి ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుంది. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు.

వేసవి కాలం ఎండ నేపథ్యంలో ఈనెల (ఏప్రిల్) 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటిపూట బడులు నడుస్తాయని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం మూడో తేదీ నుంచి ఒంటి పూటే బడులు నిర్వహించాలి అని తెలిపారు. పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు.

========================

AP SA-2 & CBA-3: 2022-23:  Timetable, Blue Print & Proceedings

CLICK HERE

========================

AP: ఏప్రిల్‌ 03 (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు - తరగతుల నిర్వహణ సమయం ఇదే

CLICK HERE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags