Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Launches 'Pratibha Setu' - Opportunity for Employment in Private Companies

 

UPSC Launches 'Pratibha Setu' - Opportunity for Employment in Private Companies

యూపీఎస్సీ: స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కని వారి కోసం 'ప్రతిభా సేతు' పోర్టల్ - ప్రైవేట్ కంపెనీల లో ఉపాధి కల్పన కి అవకాశం

===================

యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రత్యేకంగా 'ప్రతిభా సేతు' పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు మన్కీ బాత్ 125వ కార్యక్రమంలో మోదీ తెలిపారు.

దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటని.. ప్రతి ఏడాది ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారన్నారు. ఎంతో సమయం, డబ్బును ఖర్చు చేసి నిజాయతీగా కష్టపడుతున్న అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారని.. ఇలాంటి వారి కోసం 'ప్రతిభా సేతు' పోర్టల్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

సివిల్స్ పరీక్షల అన్ని దశలలో ఉత్తీర్ణత సాధించి.. మెరిట్ లిస్టులో పేరు లేని అభ్యర్థుల వివరాలను ఇకపై ఈ పోర్టల్లో ఉంచనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ వివరాలను ప్రైవేట్ కంపెనీలు తీసుకొని.. తమ సంస్థలలో వారికి ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు.

===================

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags